అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం జరిగిన జ్యోతుల పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పి ఏ సీ సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి, పలువురు ప్రముఖులు, అధికారులు చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ప్రముఖులను స్వాగతించి పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.