పామూరు మండలంలో రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మి సూచించారు. పామూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఎంపీపీ గంగసాని లక్ష్మి అధికారులతో సమీక్ష నిర్వహించి ,సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ వాసుదేవరావు తోపాటు మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.