డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమన్వయంతో, సమర్థవంతంగా అమలు చేసి, వంద శాతం శిశువులకు పోలియో చుక్కలు వేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 21వ తేదీన జిల్లాలో మొత్తం 3 లక్షల 52 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఉందన్నారు.