బోధన్: బోధన్ పట్టణంలో మురికి కలువలో పడి వ్యక్తి మృతి
బోధన్లోని ఇందూరు మోడల్ స్కూల్ సమీపంలో మురికి కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. మృతుడి జేబులో ఆధార్ కార్డు ఆధారంగా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిర్మల్ లక్ష్మణ్ గా గుర్తించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.