శ్రీశైలం: ఆర్టీసీ బస్టాండ్ లో చాకచక్యంగా బైకు దొంగతనం సీసీ కెమెరాలు రికార్డు నమోదు
ఆర్టీసీ బస్టాండ్లో పార్క్ చేసిన బైకులే టార్గెట్గా దొంగలు చాకచక్యంగా దోపిడీలు చేస్తున్నారు.ప్రజలు, ఉద్యోగులు ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా బైకులను అపహరిస్తున్నారు.తాజాగా ఆర్టీసీ ఉద్యోగికి చెందిన బైక్ను అందరూ చూస్తుండగానే దొంగ అపహరించాడు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా అతను లెక్క చేయకుండా సునాయాసంగా బైక్ను తీసుకెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వరుసగా జరుగుతున్న చోరీలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పార్కింగ్లో ఉంచిన బైకులే లక్ష్యంగా మారడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.