గత అక్టోబర్ 16న ప్రధానమంత్రి సభల కోసం నాసిరకం నిర్మాణాలతో పాటు రోడ్ల దోపిడీపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని ప్రాంతీయ విజిలెన్స్ ఐపీఎస్ అధికారిణి చౌడేశ్వరి గారికి పట్టణ సంఘం పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం 12 గంటలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రోడ్ల దోపిడీపై తీసిన ఫోటోలను అధికారికి చూపెట్టారు. కోట్లు వెచ్చించి వేసిన ఖరీదైన కంకర ను ఎత్తుకు పోతుంటే సంబంధిత అధికారులు స్పందించడం లేదన్నారు. సభల అనంతరం మొత్తం కంకర ను ఉపయోగించుకొని ఉంటే రోడ్లు లేని అనేక ప్రాంతాలు అభివృద్ధి అయ్యేవని తెలిపారు.