అనంతపురం నగరంలోని నడిమి వంక సమీపంలో రోడ్డు దాటుతున్న మామిడి కి చెందిన జోగి లక్ష్మీ అనే వృద్ధురాలిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొన్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గుర్తించి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఆటోలు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.