దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలి. సుప్రీంకోర్టు తీర్పును పునః: రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
Ongole Urban, Prakasam | Mar 29, 2026
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం - ప్రకాశం జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీజీ భవన్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలను లేవనెత్తారు 24-03-2026న దళిత క్రిస్టియన్లను ఎస్సీలను పరిగణించరాదని సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పున: సమీక్షించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతున్నది. ఎస్సీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలి. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు మరియు మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పుపై దళిత క్రైస్తవులలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది అన్నారు