కనిగిరి పట్టణం నుండి మార్కాపురం జిల్లా కేంద్రానికి రెండు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ బస్సు సర్వీసులను ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తర్వాత నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రానికి కనిగిరి నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపడం అభినందనీయమన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు అక్కడికి వెళ్లే ప్రజలకు ఆర్టీసీ బస్సులు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.