రాష్ట్రంలోని యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలు కేవీఆర్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఓర్వకల్ హబ్లో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు వస్తున్నాయని, వాటిలో ఉద్యోగాలు సంపాదించడానికి మీకు విద్యార్హత ఉండాలని అన్నారు.