అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని పి. నాగిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం కురుబ చిన్న బొజ్జన్న పశువుల దొడ్డిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గడ్డివాములతో పాటు ఆవు దూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు దొడ్డి లో గడ్డివాములతో పాటు గుడిసెలో మూడు ఆవులు ఒక దూడ ఉన్నాయని తను వ్యవసాయ పొలంలోకి వెళ్ళిన సమయంలో ఉన్నపలంగా మంటలు చెలరేగాయి అయితే సమీపంలో ఉన్న రైతు విజయ భాస్కర్ గమనించి గుడిసెలోని రెండు ఆవులను విడిపించాడని మంటలు పొగతో మరో ఆవు, దూడను విడిపించలేక పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాయన్నారు. సుమారు రెండు లక్షల పైగా నష్టం వాటిలిందన్నారు.