శ్రీశైలం: శ్రీశైలం సాక్షి గణపతి వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు. నలుగురికి స్వల్ప గాయాలు .తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం సాక్షి గణపతి వద్ద భక్తులకు చెందిన ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి మల్లన్న దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.స్థానిక భక్తులు, దేవస్థానం సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్దగా గాయాలు లేకపోవడంతో చికిత్సకు తరువాత వారు తిరిగి దర్శనానికి వెళ్ళారు. ప్రమాదంతో రోడ్డుకు అడ్డుగా నిలిచిన కారును సిబ్బంది తొలగించి ట్రాఫిక్ను సజావుగా చేశారు.