జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది గ్రామీణ పేద ప్రజల జీవనాధారమని యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ ఈ పథకానికి గాంధీ పేరు తొలగిస్తే బీజేపీ దేశద్రోహ పార్టీగా మిగిలిపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని దినాలను తగ్గిస్తూ, చివరికి పథకాన్నే ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.