కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ వివరాలు పూర్తి కాగా, మొత్తం పురోగతి 19.46%గా ఉందని తెలిపారు. ప్రతి బూత్లో 100% మ్యాపింగ్ కోసం అదనపు ఏఈఆర్వోలను నియమించి పర్యవేక్షణ బలోపేతం చేసినట్టు చెప్పారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్