హిందూపురం పట్టణంలోని డంపింగ్ యార్డులో చెత్త రీసైకిలింగ్ చేయు యంత్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
శ్యాం ప్రసాద్
హిందూపురం పట్టణంలో పరిగి రోడ్డు నందు ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న చెత్త అంతా డంపింగ్ యార్డులో 49 టన్నుల చెత్తను సేకరించడం జరిగింది. అందులో తడి చెత్త, పొడి చెత్త, ఇనుము మరియు విద్యుత్ సంబంధించి వస్తువులను వివిధ రకాలుగా వేరు చేసిన చెత్తను, చెత్త శుద్ధి యంత్రాల ద్వారా చెత్తను ఇప్పటి వరకు 23 టన్నుల చెత్తను రీసైకిలింగ్ చేసి ఎరువుగా తయారు చేస్తారని తెలియజేశారు.