కర్నూలు జిల్లా కేంద్రంలో దేవదాయ శాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో శనివారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఇదే కార్యక్రమంలో మంత్రి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్ పాల్గొన్నారు.