రాయలసీమలో అతిపెద్ద దేవాదాయ శాఖ పరిపాలన భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. రూ.4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం విజయవాడ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదని తెలిపారు. దేవాదాయ శాఖ హామీల్లో 95 శాతం అమలు చేశామని, ఆలయాల అభివృద్ధి, అన్నప్రసాద వితరణ, అర్చకుల వేతనాలు, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి టి.జి. భరత్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.