శ్రీశైలం: నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి దొరబావి రైల్వే వంతెన సమీపంలో కారు, లారీ డీ. తప్పిన పెను ప్రమాదం
నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలోని దొరబావి రైల్వే వంతెన సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మహానంది రోడ్డు విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు