వివేకానంద నగర్ లో ఆవులను కబేలాలకు తరలిస్తున్న వారిని బిజెపి అధ్యక్షుడు వంశీ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రమాదేవి, దేవేందర్రావు గత తొమ్మిదేళ్లుగా 80 కి పైగా ఆవులకు గోరక్షణ చేస్తున్నారు. ఇటీవల ఆవులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. తీరా చూస్తే కబేలాకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులకు పట్టించామని వంశీ రెడ్డి తెలిపారు.