కాకరపల్లి రాత్రి సమయంలో ఆ రహదారిపై వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త
కాకినాడ జిల్లా కోటనందూరు నర్సీపట్నం రహదారి పూర్తిగా గోతులమయం కావడంతో నిత్యం ప్రమాదాలకు వేదికగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. ఇక వర్షం పడిన నేపథ్యంలో గోతుల్లో నీరు నిలవవున్న నేపథ్యంలో ఆ సమస్య మరింత పెరుగుతుందన్నారు. ఇక రాత్రి వేళల్లో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను అధికారులు స్పందించి పరిష్కరించాలని ముఖ్యంగా కాకరపల్లి జంక్షన్లో ఈ సమస్య ఏర్పడిందని పలువురు పేర్కొన్నారు