కావలి పట్టణానికి చెందిన తెదేపా సీనియర్ నాయకులు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు నివాసంలో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరికీ శాంతి, ఆనందం కలగాలని, కావలి నియోజకవర్గ ప్రజలపై స్వామివారి చల్లని చూపులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.