రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నివాళులర్పించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, విద్య అవసరాల్ని ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా అంబేద్కర్ కృషి వెలకట్టలేనిదని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజానికి బలమైన శక్తి అని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో టిడిపి కృషి చేస్తుందని తెలిపారు.