విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గుర్తింపును రద్దు చేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో శుక్రవారం AIFDS,AISA,PSU,YSRSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నాయకులు డిమాండ్ చేసారు. సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్షుడు నందు మాట్లాడుతూ తిరుపతి లోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా నాయకులు వినోదులను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారన్నారు.