భగవాన్ సత్యసాయి బాబా శతజయంతోత్సవాల్లో పాల్గొనడం కోసం భారత ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్ శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పుట్టపర్తి విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు పాల్గొన్నారు.