పాలిటెక్నిక్లో ఘనంగా జాబ్ అచీవర్స్ డే – విద్యార్థులకు నియామక పత్రాల అందజేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో జాబ్ అచీవర్స్ డే (JAD) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.అతిథులుగా DRDO శాస్త్రవేత్త డా.ఎన్.కిషోర్ నాథ్, హ్వాసంగ్ ఐఏ ఆటోమోటివ్స్ సీనియర్ హెచ్ఆర్ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సి.జయచంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆటోమొబైల్, సివిల్, ఈఈఈ, ఈసిఈ, మెకానికల్ విభాగాలకు చెందిన మొత్తం 513 మంది విద్యార్థులు 29