వడదెబ్బ తగలకుండా వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిమ్మాపురం వైద్యాధికారి వేణు కార్తికేయ
ఆందోళనకర స్థాయిలో ఎండలు, వడగాడ్పులు వీస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణు కార్తికేయ పేర్కొన్నారు. మహానంది మండలం కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని శ్రీ అంకాల పరమేశ్వరి దేవి ఆలయం ఆవరణలో వడదెబ్బ లక్షణాలు-తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.పిల్లలు,వృద్ధులు, గర్భిణుల విషయంలో మరింత అప్రమత్తత ఉండాలన్నారు.వడదెబ్బ వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుందని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.డీ హైడ్రేషన్ గురికాకుండా ఓఆర్ఎస్ ద్రావణం,తగినంత నీరు తీసుకోవాలన్నారు.