ఆత్మకూరు మరియు వెలుగోడు పట్టణాల్లో కేడీసీసీ బ్యాంకు, సహకార సంఘాల ఉద్యోగస్తులు ఆందోళన బాట పట్టారు, సోమవారం ఉదయం బ్యాంకుల ముందు కేడిసిసి సహకార సంఘాల సిబ్బంది ఫ్లకార్డులు చేతబట్టి ,విధులు బహిష్కరించి నినాదాలు చేశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ,DFL ద్వారా నిరవధికంగా జీతభత్యాలు చెల్లించాలని, అలాగే రిటర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని,రైతు సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 36ను అమలు పరచాలన్నారు,2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని, డిమాండ్ చేస్తూ, KDCC బ్యాంకు సహకార సంఘాల సిబ్బంది నిరసనకు దిగారు.