గుంతకల్లు: గుత్తి మండలం కరిడికొండ శివారులో బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు, అనంతపురంకు తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కరిడికొండ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తాపడి రంగస్వామి అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించి మంగళవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కె.ఊబిచెర్ల గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో పని నిమిత్తం గుత్తి పట్టణానికి వచ్చాడు. అక్కడ పని ముగించుకొని అనంతరం తిరిగి కె.ఊబిచెర్ల కు వెళ్తుండగా కరడికొండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై వేగంగా వేళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి.