పెద్ద చెర్లోపల్లి మండలం పెద్ద ఇర్లపాడు లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి కబడ్డీ పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలను పిఎసిఎస్ డైరెక్టర్ ఉండేల పిచ్చిరెడ్డి, జడ్పిటిసి ఓకే రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా టిడిపి, వైసిపి నాయకులు క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అనంతరం ఓకే రెడ్డి, పిచ్చిరెడ్డిలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో గెలిచిన ఓడిన క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని వారు సూచించారు.