ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ వద్ద ఈదరవాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. వర్షాల సమయంలో వాగు ఉధృతి పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. దీనివల్ల మారెళ్ళ జమ్మలమడక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో పాత తూములు వాడటం ప్రమాదకరమని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వంతెన ఏర్పాటు చేయాలని కోరారు.