అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజాబాబు, కుమారుడు రెడ్డి ప్రసాద్ 19 సంవత్సరాలు పై కోమటివాని చెరువు సమీపంలో ప్రత్యర్ధులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రెడ్డి ప్రసాద్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని వదిలి పారిపోయిన ప్రత్యర్ధులు. స్థానికులు గుర్తించి రెడ్డి ప్రసాద్ ను ప్రభుత్వాసుపత్రి తరలించారు .రెడ్డి ప్రసాద్ పరిస్థితి విషమ ఉండడంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు .ఘటనపై మదనపల్లి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటన శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వెలుగులో వచ్చింది