పలమనేరు: గంగవరం: మండలం మాజీ సర్పంచ్ మురళి తల్లి మృతి, నివాళులర్పించి పరామర్శించిన ఎమ్మెల్యే
గంగవరం: మండల మాజీ సర్పంచ్ యల్లంపల్లి మురళిని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. మురళి తల్లి తిప్పక్క ఆకస్మిక మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక మండల టిడిపి నేతలు కలిసి ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళి కుటుంబీకులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంతాప కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ రహీం, నాయకులు భాస్కర్ రెడ్డి, గిరిధర్ గోపాల్, బాలాజీ,రవి, మంజునాథ్, మురళీ తదితరులున్నారు.