మైదుకూరు: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మైదుకూరు: ప్రతి మహిళ తన వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందిగా డిప్యూటీ డీఎంహెచ్వో మల్లేశ్ సూచించారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్య గారిపల్లెలో గురువారం స్వస్థ నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య సూత్రాలపై అవగాహన కల్పించబడింది.