ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సందర్శించారు. రోగుల వార్డులను సందర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వైద్యశాలకు అవసరమైన సామగ్రిని తో పాటు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్లకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోటమి నాయకుడు తదితరులు పాల్గొన్నారు.