కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొల్లవానిపల్లిలో యశ్వంత్ కుమార్ అనే యువకుడు పాము కాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తుగ్గలి మండలం బొల్లవానిపల్లిలో ఆదివారం రాత్రి తన ఇంటి సమీపంలో యశ్వంత్ కుమార్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే చీకటిగా ఉండటంతో ముళ్ళపొదల్లో నుంచి వచ్చిన పాము యశ్వంత్ కుమార్ కు కాటు వేసి కాలికి చుట్టుకుంది. భయాందోళన చెందిన యశ్వంత్ కుమార్ కాలును గట్టిగా విదల్చడంతో పాము అతడిని వదిలి కంప చెట్లలోకి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యులకు విషయం తెలపడంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.