అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా గ్రామంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని ఏఎఫ్ ఎకాలజీ విభాగం అధికారులు నిర్వహించారు. ముఖ్యంగా ఏటీఎం మోడల్ ప్లాట్ లో సుమారు 30 సెంట్లు విస్తీర్ణంలో రైతులు అన్ని రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. రసాయన మందులు పిచికారి కాకుండా ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం తదితర వాటితో జీవామృతం పంచగవ్య లాంటి కషాయాల తయారీ నేర్పించారు. ఈ కార్యక్రమంలో సిబిఓ కోఆర్డినేటర్ భాస్కర్ బాబు, ఎంటిఎల్ భవాని సిబ్బంది ఉజ్వల, ఆదినారాయణ పాల్గొన్నారు.