నిజామాబాద్ సౌత్: నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష, మరో ఐదుగురికి జరిమానా
నిజామాబాద్ నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్ష, మరో ఐదుగురికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ మేరకు ముగ్గురికి జైలు శిక్ష, మరో ఐదుగురికి రూ. 8500/- జరిమానా వేధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.