రాజేంద్రనగర్: షాద్నగర్లో కవి గాయకులు అందెశ్రీకి నివాళులు అర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందెశ్రీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.