అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో గురువారం రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పప్పు శనగ పంటకు సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని సెంట్రల్ జనరలి ఇన్సూరెన్స్ అధికారులు నిర్వహించారు. స్థానిక సహకార సంఘ సీఈఓ పాండురంగ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ నబి రసూల్, స్థానిక మాజీ ఎంపీటీసీ కెంచి రాముడు లతో కలిసి రైతులకు పప్పుశనగ పంటకు పంటల బీమా ప్రీమియంపై వివరించారు. రైతులు ఈ నెల 15 లోగా ఎకరాకు రూ.450 చొప్పున బీమా ప్రీమియం చెల్లించి పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.