నాగులుప్పలపాడు మండలంలోని బి.నిడమానూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, నాణ్యతగా ప్రతిరోజు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వసతిగృహంలో అందించాలని హాస్టల్ వార్డెన్ ను లక్ష్మానాయక్ ఆదేశించారు.