నంద్యాల అర్బన్: నంద్యాలలో ఈపాస్ విధానాన్ని రద్దు చేయాలంటూ రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
హెచ్ఐర్ఎంఎస్ ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి, గతంలో ఉన్న మాన్యువల్ విధానంలోనే రైల్వే పాసులు జారీ చేయాలని కోరుతూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు నంద్యాలలో నిరసన చేపట్టారు. ఈ-పాస్ విధానం కారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.