మంత్రాలయం:కూటమి ప్రభుత్వం త్వరగా ఒక కమిటీని వేసి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమాలు మరింతగా ఉధృతం చేస్తామని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు మోహన్ హెచ్చరించారు. ఆదివారం మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ఇచ్చారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆయన కోరారు.