ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు సమాజానికి వెన్నెముక అని అందుకే రైతే రాజుగా కీర్తించబడుతున్నారని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సిరిపురం నాగరాజు, సన్ రైజర్స్ పాఠశాల కరస్పాండెంట్ మారెన్న పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప లోని సన్ రైజర్స్ పాఠశాలలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. రైతుల శ్రేయస్సు కోసం కృషిచేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23 ను ప్రతి ఏటా జాతీయ రైతు దినోత్సవం, కిసాన్ దివాస్ గా జరుపుకుంటారన్నారు. అనంతరం పాఠశాలలో రైతుల జీవన విధానం, మహిళా రైతుల వేషధారణలతో చిన్నారుల చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.