డోన్: ప్రజలు పరిశుభ్రతకు సహకరించాలి: బేతంచర్ల మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | May 29, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణ ప్రజలు పరిశుభ్రతకు సహకరించి, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని బయటపేట డ్రైవర్స్ కాలనీ కందకం ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ కాలువలు, వీధులను నగర పంచాయతీ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.