మార్కాపురం జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో వెలిసిన అల్లూరి పోలేరమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉగాది పండుగ ముందు నాలుగు వారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా రెండవ ఆదివారం కావడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు