హైదరాబాద్ బేగంపేట్ ఫ్లైఓవర్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు ఫ్లైఓవర్పై బోల్తా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్పై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.