అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నివాసం ఉంటున్న విద్యార్థికి గత నెల 28న జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. అయితే జ్వరం తగ్గకపోవడంతో ఈ నెల 9న తిరుపతి రుయా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.