ఓబులవారిపల్లె మండలం వై. కోట నుండి రైల్వే కోడూరు కు బస్సు ప్రారంభం.. కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
ఓబులవారిపల్లె మండలం వై. కోట గ్రామస్తుల వినతి మేరకు ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు స్పందించి రైల్వే కోడూరు నుండి వై కోటకు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. వై.కోట గ్రామస్తులు, ఆర్టీసీ అధికారులు బస్సు ను శనివారం ప్రారంభించారు. సుమారు 2 వేల కుటుంబాలు 5600 మంది జనాభా ఉన్న తమ గ్రామానికి బస్సు నడపాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వై. కోట ప్రాంతం నుంచి విద్యార్థులు, పేదలు వ్యవసాయ కూలీలు, బడుగు బలహీన వర్గాల వారు వివిధ పనుల మీద ప్రతిరోజు కోడూరు వెళ్లడానికి బస్సు ప్రయోజనకరంగా ఉంటుందని, గ్రామస్తులు అధికారులకు, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.