నంద్యాల జిల్లాలోని పలుచోట్ల వర్షం పడుతోంది. అవుకు మండలం రామాపురంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండవేడితో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.