అంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు నిర్వహించారు. వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం మూలంగా వైద్య విద్యకు పేద బడుగు బలహీన వర్గాలు దూరం అవుతాయన్నారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.